సంఘము యొక్క బోధనా పరిచర్య
మారుమనస్సు వద్ద పరివర్తన జరుగుతుంది. మారుమనస్సు క్రొత్త కోరికలు మరియు క్రొత్త ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది - మార్పు చాలా గొప్పది, బైబిల్ అతన్ని "క్రొత్త సృష్టి" గా అభివర్ణిస్తుంది (2 కొరింథీయులకు 5:17).
కానీ, కొన్ని విషయాలు నేర్చుకొనుటకు సమయం పడుతుంది. మారుమనస్సు తన జీవితంలోని అన్ని భాగాలకు క్రైస్తవ సూత్రాలను ఎలా అన్వయించుకోవాలో వెంటనే నేర్చుకోలేదు. ముందు అతడు సూత్రాలను నేర్చుకోవాలి, తరువాత వాటిని తన మార్గాలకు అన్వయించుకొంటాడు.
ఇందులో వ్యక్తిగత అధ్యాత్మిక పరిపక్వత యొక్క ప్రక్రియ కూడా ఉంటుంది. క్రొత్తగా మారుమనస్సు పొందినవ్యక్తి "క్రీస్తులో శిశువే."
► ఒక విద్యార్థి, సమూహం కొరకు 1 కొరింథీయులకు 3:1-2 చదవాలి. ఈ వచనాల ప్రకారం, క్రొత్తగా మారుమనస్సు పొందిన వ్యక్తి యొక్క విలక్షణత ఏమిటి?
► ఒక విద్యార్థి, సమూహం కొరకు హెబ్రీయులకు 5:13-14 చదవాలి. ఈ వచనాలలో పాలు అంటే ఏమిటి ? మాంసము అంటే ఏమిటి? అధ్యాత్మిక పరిపక్వత యొక్క లక్షణం ఏమిటి?
ప్రారంభ ఈ కోర్సులో, యేసు సంఘము ఇచ్చిన గొప్ప ఆజ్ఞను చూశాము. దాన్ని మళ్ళీ చూద్దాం.
► ఒక విద్యార్థి, సమూహం కొరకు మత్తయి 28:18-20 చదవాలి. ఈ భాగములో, సువార్త ప్రచారానికి మించి యేసు ఏ బాధ్యత ఇచ్చాడు?
గొప్ప ఆజ్ఞ ఇచ్చే ముందు, పరలోకమందును మరియు భూమిమీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది అని యేసు చెప్పాడు. ఈ బాధ్యతను సంఘమునకు ఇచ్చినందున ప్రజలను తన అధికారంనకు విధేయత చూపుటకు నడిపించాలి.
సువార్త ప్రకటించడము మాత్రమే కాదు, తాను ఆజ్ఞాపించినవ దానిని వారికి బోధించమని శిష్యులకు చెప్పారు. సువార్త అనేది పని యొక్క మొదటి భాగం మాత్రమే. యేసు ఆజ్ఞలన్నింటికీ కట్టుబడి ఉండాలని బోధించడం శిష్యత్వ ప్రక్రియ. శిష్యత్వంలో విఫలం కావడం సువార్త ప్రకటనలో విఫలమైనంత తీవ్రమైనది.
సంఘము యొక్క బోధనా పరిచర్య మారుమనస్సు పొందినవారిని అధ్యాత్మిక పరిపక్వతలోనికి తీసుకొని వచ్చేది.
విశ్వాసులను పెంపొందించుకునే ఉద్దేశ్యంతో దేవుడు తన ప్రజలకు ప్రత్యేకమైన పరిచర్యను అప్పగించాడు, తద్వారా వారు పసిపిల్లలుగా ఉండరని ఎఫెస్సి లేఖనలో మనకు చెప్పబడింది (ఎఫెసీయులకు 4:11-14). ఈ బోధన ఫలితము ద్వారా వారు అధ్యాత్మిక యుక్తవయస్సు చేరుకున్న ఫలితంగా సిద్ధాంత స్థిరత్వం కలిగి ఉందురు.
ఒక కాపరి శిష్యులను తయారు చేయుట ముఖ్య బాధ్యతగా వహిస్తాడు. పౌలు తిమోతితో ఇలా అన్నాడు, "చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము" (1 తిమోతి 4:13). అతడు ప్రధానంగా తిమోతి వ్యక్తిగత అధ్యయనము గురించి ప్రస్తావించలేదు; అతడు పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి పరిచర్య ఏమిటంటే, గ్రంథాన్ని చదవడం మరియు వివరించడం, అధ్యాత్మిక పద్ధతిని చూపడం మరియు క్రైస్తవ సిద్ధాంతాన్ని బోధించడం. బోధించడం కాపరి యొక్క అర్హతలలో ఒకటి (1 తిమోతి 3:2).
నేర్చుకొనుట అధ్యాత్మిక నిర్మాణంలో భాగం కాబట్టి, బోధ అనేది శిష్యత్వపు పనిలో భాగం. సంఘములో ఉపాధ్యాయులు ముఖ్యమైనవారు, మరియు ఉపాధ్యాయులు అభివృద్ధి చెందడానికి సంఘము ఎల్లప్పుడూ కృషి చేయాలి.
[1]" నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము" (2 తిమోతి 2:2). అనుభవజ్ఞుడైన సువార్తికుడు మరియు కాపరి నుండి యవ్వన పరిచారకుని వరకు ఈ సూచనను పౌలు తిమోతికి ఇచ్చాడు. బోధించడం ద్వారా మాత్రమే విశ్వాసం కొనసాగుతుందని పౌలు నమ్మలేదు. వ్యక్తులు ప్రత్యేక ప్రయత్నంతో శిక్షణ పొందాలి మరియు ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.
సమాజమంతటికీ బోధించడం ద్వారా అలాంటి శిక్షణ సాధించకపోతే, ఈ "నమ్మకమైన పురుషులు" వ్యక్తిగతంగా లేదా చిన్న సమూహాలలో శిక్షణ పొందవలసి ఉంటుంది.
బోధించడానికి చాలా బోధ ఉంటుంది. ఏ కాపరికి ఇవన్నీ చేయడానికి సమయం ఉంటుంది, ప్రత్యేకించి అందరూ ఒకే సమయంలో ఒకే బోధకు సిద్ధంగా ఉండరు కాబట్టి? కానీ ఎఫెసీయులకు 4:11, "అతడు ఒక కాపరిని ఇచ్చాడు" (అంటే ఒక వ్యక్తి మాత్రమే మరియు ఒక పాత్ర మాత్రమే) అని చెప్పలేదు. బదులుగా, వివిధ పాత్రలు మరియు వాటిని పూరించడానికి చాలా మంది ఉన్నారు. దేవుడు ఉపాధ్యాయులను అనుగ్రహించాడు, వారికి బోధనా సామర్థ్యాన్ని ఇస్తాడు మరియు సంఘము ద్వారా బోధనా పరిచర్య కొరకు వారిని సిద్ధం చేస్తాడు.
యేసు ప్రణాళిక యొక్క ప్రారంభ లక్ష్యం ఏమిటంటే, ఆయన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిన తర్వాత తన జీవితానికి సాక్ష్యమిచ్చే మరియు తన పనిని కొనసాగించగల పురుషులను శిష్యులనుగా చేర్చుకోవడం
(రాబర్ట్ కోల్మన్, ది మాస్టర్స్ ప్లాన్).