రోమీయులకు రాసిన పత్రిక, ఒక వ్యక్తి రక్షణను, ఆశీర్వాదాన్ని పొందడానికి దేవునితో సంబంధంలోనికి ఎలా వస్తాడో వివరిస్తుంది. దేవునితో సంబంధం అనేది విశ్వాసం ద్వారా పొందిన కృపపై ఆధారపడి ఉంటుంది. ఈ సందేశం, ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రశ్నలు ఉత్పన్నమవ్వడానికి కారణమవుతుంది. దేవునికి, ఇశ్రాయేలుకు మధ్య ఉన్న ప్రత్యేక సంబంధానికి ఏమైంది? యూదుడైన వ్యక్తి ఎలా రక్షణ పొందుతాడు? దేవుడు ఇశ్రాయేలు పట్ల ఇంకనూ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడా? పౌలు సువార్త సందేశాన్ని వివరించడం కొనసాగిస్తున్నప్పుడు, ఈ అధ్యాయాలు ఆ ప్రశ్నలకు సమాధానమిస్తాయి.
“అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు?” (రోమా 9:20). కొంతమంది ప్రజలు ఈ వచనాన్ని ఉపయోగించి, దేవుని న్యాయాన్ని పరీక్షించడానికి ప్రయత్నించే ఏ వ్యక్తినైనా గద్దిస్తారు. దేవుని న్యాయం, మన న్యాయంకంటే ఎంతో ఉన్నతమైనదని, దానిని మనం అర్థం చేసుకోలేమని చెబుతారు.
[1]నలుపును తెలుపుగా మార్చే, దుష్టత్వాన్ని మంచిగా మార్చే ఉన్నతస్థాయి న్యాయం ఉందా? ఒక న్యాయమూర్తి చిన్నపిల్లలకు తీర్పు తీర్చేటప్పుడు, పొరపాట్లను, ఉద్దేశ్యపూర్వకంగా చేసే నేరాలను ఒకే విధంగా తీర్పుతీరుస్తాడు మరియు వారు నివారించలేనివాటిని చేసినందుకు ప్రజలను శిక్షిస్తాడు, అప్పుడు మనం ఆయన్ని అన్యాయస్థుడు అంటామే గాని ఉన్నతస్థాయి న్యాయానికి అనుగుణంగా తీర్పు తీర్చాడని అనము.
దేవుని న్యాయం, ఉన్నతమైనది, కానీ మన న్యాయానికి వ్యతిరేకమైంది కాదు. న్యాయాన్ని గూర్చిన మన భావన ఆయన నుండి వస్తుంది మరియు ఆయన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగానే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడు. కొన్నిసార్లు ఆయన చర్య మనకు అన్యాయమని అనిపిస్తుంది, ఎందుకంటే మనం వాస్తవాలన్నింటిని చూడలేము, ఎందుకంటే మన విలువలు భూసంబంధమైనవి, ఎందుకంటే మన దృక్కోణాలు, మన కోరికలను బట్టి చెడిపోయాయి.
దేవుడు న్యాయవంతుడనని చెప్పుకొని, తన మార్గాలను తన సృష్టికి వివరించడానికి నిరాకరించేవాడు కాదు. దానికి బదులుగా, దేవుని న్యాయం కనబడుతుందని రోమా పత్రిక నొక్కి చెబుతుంది. దేవునిని తిరస్కరించేవాళ్ళు, దేవుని గురించి వాళ్ళకు తెలిసిన విషయాలను బట్టి నిరుత్తరులుగా ఉన్నారు (1:20). తీర్పుకు తాము యోగ్యులమని పాపం చేసేవారికి తెలుసు (1:32). రోమా పత్రిక 2వ అధ్యాయం, పూర్తిగా దేవుని తీర్పుల నిష్పాక్షికత మరియు స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. ప్రాయశ్చితకార్యం అంటే దేవుడు, పాపులను నీతిమంతులుగా తీర్చినప్పటికిని, ఆయన న్యాయవంతుడుగానే ఉండడం (3:26).
మనం దేవునిని న్యాయవంతునిగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణాన్ని బట్టి, దేవుడు తన రక్షణ విధివిధానాలను, అవి న్యాయమైనవనుటకు కారణాలను వివరించాడు. దేవునిని న్యాయవంతునిగా చూడనంతవరకూ, ఆయనను నిజంగా ఆరాధించడం సాధ్యం కాదు. దేవుడు న్యాయవంతుడని మనం నమ్మకపోతే, ఆయన పట్ల మన విధేయత నిరంకుశుడైన వ్యక్తికి లేదా దోపిడీదారునికి విధేయత చూపినట్లు అవుతుంది.
కాబట్టి, దేవుడు తనను తాను విచారణకు గురిచేసుకున్నాడు లేదా తనను తాను ఆ స్థితిలో ఉంచుకున్నాడు (3:4). ఆయన చర్యలు, వాస్తవ న్యాయంతో అనుగుణంగా ఉంటాయనే నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుని చర్యలను నిజాయితీగా విచారిస్తే, ఆయన నీతిమంతుడని మరియు పాపి, దోషియని చూపిస్తుంది.
► దేవుని చర్యల న్యాయాన్ని అర్థం చేసుకోవడం మనకెందుకంత ప్రాముఖ్యం? మనం తన న్యాయాన్ని అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడని మనమెలా తెలుసుకోవచ్చు?
దేవుని సార్వభౌమాధికారాన్ని గురించి బైబిల్ దృక్కోణం:
పర్యవసానాలతో పాటుగా నిజమైన ఎంపికలు చేసుకోవడానికి ప్రజలను అనుమతించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు.
ప్రజలు తీసుకున్న నిర్ణయాలకు దేవుడు స్పందిస్తాడు (రోమా 1:24, 26, 28).
ఒక వ్యక్తి ఏం చేసినా కూడా దేవుడు తన అంతిమ ప్రణాళికను నెరవేర్చడానికి శక్తిమంతుడు, జ్ఞానవంతుడు.
ప్రతి వ్యక్తి సువార్తను అంగీకరించాలా వద్దా, అనే దానిని ఆధారం చేసుకొని రక్షణ పొందాలా లేదా తృణీకరించాలా అనేది నిర్ణయించుకోవచ్చు. దేవుడు రక్షణను అనుగ్రహించి, ప్రజలకు తమ అపరాధాన్ని గురించి గ్రహింపును, కృప కొరకు ఆశను, విశ్వసించడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆవిశ్వాసులు పశ్చాత్తాపపడేలా ప్రేరేపించడానికి సేవకులను పంపుతాడు. కానీ వ్యక్తి రక్షణను గురించి తన వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకుంటాడు.
“నిత్యుడైన దేవునిగా ఉండడం అంటే, ఆయన సమస్త దురాత్మల, సమస్త దేవదూతల, సమస్త మానవుల ఎదుట నిందారోపణకు పైగా నిలబడగలగాలి. ఆయన అన్యాయస్తుడని ఎవరూ ఆయన్ని (సరిగా) నిందించలేరు.”
- ఆర్.జి. ఫ్లెక్సన్, Rudiments of Romans
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 5వ భాగం, 1వ లేఖన భాగం
9వ అధ్యాయం యొక్క ప్రధానాంశం
దేవుడు రక్షణ మార్గాన్ని నిర్ణయించాడు మరియు ఏ వ్యక్తి మరో మార్గంలో రక్షణ పొందలేడు.
9వ అధ్యాయం యొక్క సారాంశం
ఈ అధ్యాయాన్ని, ఎవరు రక్షణ పొందుతారో మరియు ఎవరు నశిస్తారో దేవుడు నిర్ణయిస్తాడనే అర్థంలో తప్పుడు వ్యాఖ్యానాన్ని పొందుతుంది, కానీ మనకు తెలియని ప్రాతిపదికపై ఆ నిర్ణయం ఉంటుందని భావిస్తారు. వాస్తవానికి, విషయమేమిటంటే దేవుడు రక్షణ మార్గాన్ని నిర్ణయించాడు మరియు ఏ వ్యక్తి మరొక మార్గంలో రక్షణ పొందలేడు. ఎలాంటి ప్రామాణికం లేకుండా కొంతమందిని అంగీకరించడం, కొంతమందిని తిరస్కరించడం ద్వారా ఆయన సార్వభౌమాధికారం వ్యక్తీకరించబడదు. ఆయన సార్వభౌమాధికారం, ఒక ప్రామాణికతను అంటే రక్షణ మార్గం యొక్క నమూనాను ఏర్పరచడం ద్వారా వ్యక్తీకరించబడుతుంది.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 9:1-5 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(9:1-3) ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయంగా నశించిపోయినందున, పౌలు తన వేదనను వ్యక్తీకరిస్తున్నాడు. తాను వారికి సహోదరుడనని ఆయన ప్రస్తావించాడు. పౌలు, యూదుల మతంలో గొప్పగా రాణించాడు. వారి పండితులను ఆయన గౌరవించాడు. చాలామంది బోధకులు, నాయకులు మరియు వాళ్ళు సేవ చేసిన ప్రజల్లో అనేకమంది క్రీస్తును తృణీకరించారని గ్రహించి అతను దుఃఖపడ్డాడు.
(9:4-5) ఇశ్రాయేలు, గొప్ప ఆత్మీయ ఆధిక్యతలు కలిగిన రాజ్యం
వాళ్ళు మొదటిగా దేవునిని తండ్రిగా కలిగి ఉన్నారు.
దేవుడు బయలుపరిచిన మహిమను వాళ్ళే మొదట చూశారు.
వారు
నిబంధనలను, తన ఆశీర్వాద నియమాలుగా కలిగి ఉన్నారు.
ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు.
ఆరాధన విధానాన్ని కలిగి ఉన్నారు.
అంతిమ రక్షణను గూర్చిన వాగ్దానాన్ని కలిగి ఉన్నారు.
పితరులు, యూదులు.
యేసు, యూదునిగా జన్మించాడు.
పౌలు గతంలో 3:1-2 లేఖన భాగంలో యూదులు గొప్ప ప్రయోజనాలను కలిగి ఉన్నారని చెప్పాడు.
యూదామతం, క్రైస్తవమత మూలం
యూదామతాన్ని, క్రైస్తవ్యానికి మూలమని చెప్పవచ్చు. యూదా మతం, ఇతర మతాలకంటే ఎక్కువగా క్రైస్తవ్యంతో పోలికను కలిగి ఉంది. యూదా మతం క్రీస్తును తిరస్కరించేవరకు తప్పుడు మతంగా లేదు.
యూదా మతానికి, క్రైస్తవ్యానికి మధ్యనున్న కొన్ని సంబంధాలను ఇక్కడ పేర్కొనడం జరిగినది.
1. క్రైస్తవులు, యూదామతాన్ని ఆచరించేవారు పాత నిబంధనలో ప్రత్యక్షపరచబడిన దేవుని ఆరాధిస్తారు.
2. యూదా మతం, క్రైస్తవ్యానికి దైవజ్ఞానపరమైన, తాత్వికమైన పునాదిని అందిస్తుంది. ఇశ్రాయేలు దేశం, ఏకదైవారాధన కలిగి, నిత్యుడు, సృష్టించబడనివాడు, పరిశుద్ధుడునైన దేవుని యందు విశ్వాసముంచుతుంది. దేవుడు సమస్తాన్ని మంచిగా సృష్టించాడు, కానీ పాపం వలన దుష్టత్వం, శ్రమ వచ్చాయి. మనిషి దేవుని స్వరూపంలో చేయబడిన ప్రత్యేకమైన సృష్టి మరియు తన విమోచన తరువాత మహిమాయుక్తమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మనం ఈ సత్యాలను భావిస్తూ ఉంటాం, కానీ ప్రాచీన ఇశ్రాయేలు చుట్టూ ఉన్న మతాలన్నింటితో అవి విభేధిస్తాయి. ఈ సత్యాలు మొదటిగా ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచబడ్డాయి.
3. క్రైస్తవులు మరియు యూదా మతాన్ని అనుసరించేవారు పాతనిబంధనను లేఖనంగా అంగీకరిస్తారు, కానీ యూదామతాన్ని అనుసరించేవారు క్రొత్త నిబంధనను అంగీకరించరు.
4. క్రైస్తవ్యాన్ని స్థాపించిన యేసు, యూదుడు మరియు తన ప్రజల మతాన్ని ధృవీకరించాడు. ఆ మతం యొక్క నిజమైన ప్రాధాన్యతలను ఆయన ప్రకటించాడు మరియు పరిసయ్యుల వక్రీకరణలను గద్దించాడు. ఆయన తానొక క్రొత్త మతాన్ని స్థాపించానని చెప్పలేదు గాని, పాత దానినే నెరవేరుస్తున్నానని చెప్పాడు.
5. మెస్సీయా నిరీక్షణ అనేది యూదా మతానికి గుండె లాంటిది. యేసు, యూదుల మెస్సీయా అని నమ్మిన యూదులే మొదటి క్రైస్తవులు.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 5వ భాగం, 1వ లేఖన భాగం
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 9:6-16 వచనాలు చదవాలి..
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(9:6-9) వారిలో కొంతమంది రక్షణ పొందారు; దేవుని వాక్యం ప్రభావాన్ని చూపింది. దేవుని ప్రజలు అంటే అబ్రాహాము నుండి వచ్చిన సంతానం కాదు. వాళ్ళు దేవుని వాగ్దానాన్ని నమ్మడం ద్వారా రక్షణ పొందిన వారు.
దేవుడు అబ్రాహామును ఎన్నుకొన్నప్పటి నుండి, రక్షణను ఈవిధంగానే ప్రణాళిక చేశాడు. ఇస్సాకు నుండి కొనసాగిన దేవుని రక్షణ ప్రణాళిక, విశ్వాసానికి స్పందనగా దేవుడు చేసిన పని. వాగ్దానం, విశ్వాసం, తరువాత అద్భుతం అనేది రక్షణ పట్ల దేవుని నమూనా. ఇస్సాకు జన్మించడమే ఒక అద్భుతం.
ఇష్మాయేలు, సహజమైన విధానంలో జన్మించాడే గాని, అద్భుతం ద్వారా జన్మించలేదు మరియు దేవుడు ఇతన్ని రక్షణ ప్రణాళిక కొరకు వాడుకోలేదు. ఇదే నియమాన్ని బట్టి, దేవుడు రక్షణ కొరకు క్రియలను అంగీకరించడు. ఇష్మాయేలును వాగ్ధాన పుత్రునిగా ఉండకుండా తిరస్కరించినట్లుగానే, తమ క్రియల ద్వారా రక్షణ పొందాలని కోరుకున్న యూదులను కూడా దేవుడు తిరస్కరించాడు.
► యాకోబు, ఏశావుల సంగతేంటి? ప్రజలు పుట్టడానికి ముందే ఆయన ఎవరిని రక్షించాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడని ఈ వచనాలు చెబుతున్నాయని కొంతమంది అనుకుంటారు. నిజానికి ఈ వచనాలు దేనిని గురించి చెబుతున్నాయి?
(9:10-13) దేవుడు ఏశావుకు బదులు యాకోబును ఎన్నుకున్నప్పుడు, ఎవరిని రక్షించాలనే విషయాన్ని ఆయన ఎన్నుకోలేదు. తన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి వాడుకొనే వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. ఇది అధ్యాయం యొక్క ప్రధానాంశం: రక్షణ సాధనాన్ని నిర్ధారించే దేవుని హక్కు. పాత నిబంధనలో ఏశావు జీవితాన్ని గురించి సమాచారం, వాస్తవానికి అతని హృదయం మారిందని, బహుశా అతను రక్షణ పొంది ఉండవచ్చని చూపిస్తున్నాయి. అతను రక్షణ నుండి తృణీకరించబడలేదు కానీ ఎన్నుకోబడిన దేశానికి, మెస్సీయాకు తండ్రిగా ఉండే ఆధిక్యత నుండి తృణీకరించబడ్డాడు. ‘ద్వేషించితిని’ అనే మాటకు అర్థం, "మరొకరికి అనుకూలంగా తిరస్కరించడం" అని అర్థం, అంటే తన పట్ల మనకున్న విధేయతతో పోల్చితే మన తల్లిదండ్రిని ద్వేషించాలని యేసు చెప్పిన మాటల్లో భావమిదే (లూకా 14:26).
దేవుడు యాకోబులో ఉన్న లక్షణాలను బట్టి అతన్ని ఎన్నుకోలేదు లేదా ఏశావులో ఉన్న పొరపాట్లను బట్టి అతన్ని తృణీకరించలేదు. దేవుడు నిర్ణయించినప్పుడు వాళ్ళు మేలుగాని, కీడుగాని చేయలేదని ఈ లేఖనం నొక్కి చెబుతుంది. వాస్తవానికి వారి భవిష్యత్ ఏమిటో దేవునికి తెలుసు. ఇక్కడ విషయమేమిటంటే, తన వ్యక్తిగత ప్రణాళిక ప్రకారం ఆయన ఎంపిక చేసుకుంటాడు.
► మనకు తెలియని కారణాలను బట్టి దేవుడు తాను రక్షించే వారిని ఎన్నుకుంటాడని 9:14-16 వచనాలు నిరూపిస్తున్నాయని కొంతమంది చెప్తారు. మన చర్యలు మరియు ఎంపికలు, మనం రక్షించబడతామా లేదా అనే విషయాన్ని నిర్ధారించవని వాళ్ళు చెప్తారు. వాస్తవానికి ఈ వచనాలు ఏం చెబుతున్నాయి?
(9:14-16) తాను ఎవరికి కృప చూపించాలో దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన ఎలాంటి ఆధారం లేకుండా లేదా మనకు తెలియని ఒక ఆధారం లేకుండా దీనిని చేస్తాడని భావం కాదు. దేవుడు, తన కృపకనికరాలకు ఆధారాన్ని చూపించాడు: “భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును” (యెషయా 55:7).
మనం నమ్మినట్లయితే రక్షణ కొరకు ఎన్నుకోబడిన వారమని, తిరస్కరిస్తే ఎన్నుకోబడలేదని ఆయన మనకు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి, ఒక వ్యక్తి తానెలా రక్షించబడాలో నిర్ణయించుకోవడం తన చిత్త ప్రకారం జరిగేది కాదు. రక్షణ, దేవుని కృప ద్వారా, ఆయన నిర్దేశించిన విధానంలోనే పొందాలి.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 9:17-23 వచనాలు చదవాలి. దేవుడు, ఫరోను దుష్టునిగా సృష్టించి, అతను చెడు/కీడు చేసేలా నియంత్రించాడా?
(9:17-18) ఫరో శిక్ష అనుభవించడానికి జన్మించలేదు, కానీ అతను ఏం చేస్తాడో దేవునికి తెలుసు గనుక అతని అధికార స్థానంలో దేవుడు అతన్ని ఉంచాడు. ‘నియమించితిని’ అనే మాట అతని సృష్టిని సూచించడం లేదు, కానీ అతన్ని పాలకునిగా నియమించడాన్ని సూచిస్తుంది. విశ్వాసముంచే వారి పట్ల దేవుడు కరుణ చూపుతాడు మరియు విశ్వాసముంచని వారిని కఠినపరుస్తాడు. కఠినపరచడం అనే దేవుడు ఒక మంచి వ్యక్తిని చెడ్డవాడిగా మారుస్తాడని భావం కాదు. ఫరో, తాను చేయాలనుకున్నది చేసే సంకల్పాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు.
కఠినపరచబడిన హృదయాలు కలిగిన వారు, తమ స్థితిని బట్టి అపరాధులు. కాబట్టి, న్యాయాన్ని బట్టి, వారి ఎంపిక/నిర్ణయం వాస్తవమైనది. 2:4-5 వచనాలలో, సత్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరించడంతో సంబంధం కలిగిన హృదయ కాఠిన్యతను బట్టి అన్యులను గద్దించాడు. (యిర్మీయా 19:15; నెహెమ్యా 9:25-29; మార్కు 16:14 మరియు హెబ్రీయులకు 3:7-13 కూడా చూడండి). ఫరో మొదట దేవునిని తిరస్కరించకపోతే, అతని కఠిన హృదయం ఉండేది కాదు.
(9:19) ఇక్కడ కొంతమంది అభ్యంతరాన్ని లేవనెత్తుతారు: ఫరో విషయంలో చేసినట్లుగానే దేవుడు ప్రజలను నియంత్రించగలిగితే, ఎవరైనా ఎలా తీర్పులోనికి వస్తారు? ఎవరూ ఆయన చిత్తాన్ని నిరోధించలేరు/ప్రతిఘటించలేరు.” చివరికి దేవుడు తాను కోరుకున్నది చేయమని బలవంతం చేస్తే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎదిరించినందుకు క్షమాపణ పొందాలని అభ్యంతరం చెప్పేవాడు. కానీ దేవుడు తన విషయంలో ఇష్టపూర్వకంగా ప్రతిస్పందించేవారిని మరియు ప్రతిస్పందించని వారిని గుర్తించగలడు. [1]
(9:20-23) దేవుడు అంతిమంగా అందరిని బట్టి మహిమ పొందినప్పటికిని, కొంతమందిని తీర్పు కొరకు, మరికొంతమందిని కరుణ కొరకు ఎంపిక చేసుకోగలడు (ఎందుకంటే ఆయన తన తీర్పులను బట్టి మరియు తన కరుణను బట్టి మహిమ పొందగలడు). ఎంపిక చేసుకోవడానికి ఆయనకు ఒక ప్రాతిపదిక ఉంది, ఎంపిక చేసుకొనే హక్కు కూడా ఉంది. దేవుడు, అంగీకారం కోసం తన ప్రమాణాన్ని నిర్ణయిస్తాడు, అది మారదు.
మట్టితో ఏం చేయాలో కుమ్మరి నిర్ణయించుకుంటాడు. మట్టిలో కొంతభాగంతో పూలకుండీని తయారు చేస్తాడు, కొంత భాగంతో చెత్తకుండీని తయారు చేస్తాడు. అదేవిధంగా, కొంతమంది కేవలం తీర్పుకే సరిపోతారని, కొంతమంది కరుణకొరకే సరిపోతారని దేవుడు నిర్ణయిస్తాడు. గ్రీకు క్రియాపదం, చర్య ఎవరు చేశారో నిర్దేశించదు. ఇది ప్రజలే తీర్పు కొరకు తమను తాము సిద్ధపరచుకున్నారని అర్థం కావచ్చు. తీర్పు వచ్చే సమయం వరకు దేవుడు వారి తిరుగుబాటును సహిస్తాడనే ప్రకటనకు ఇది అనుగుణంగా ఉంటుంది. దేవుడు వారిని తీర్పు కొరకు సృష్టించలేదు లేదా వారిని పాపులుగా చేయలేదు. వారి తీర్పు, వారు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలను బట్టి వస్తుంది. దేవుడు ఎంపిక చేసుకోవడంలో సార్వభౌముడు అనే వాస్తవానికి, ఆయన వివక్షతో ఎంపిక చేసుకుంటాడని కాదు కాని, తన వ్యక్తిగత ప్రమాణాన్ని బట్టి ఎంపిక చేస్తాడు. ఆయన దుష్టులను తీర్పుకొరకు, విశ్వాసులను రక్షణ కొరకు ఎన్నుకుంటాడు.
“నువ్వు నన్నెందు కీలాగు చేసితివి?” అనే ప్రశ్నకు, “నువ్వు నన్ను శిక్ష కొరకు ఎందుకు సృష్టించావని అర్థం కాదు” కానీ “నేను తీర్పుకు తగిన వాడినని నువ్వెందుకు నిర్ణయించుకున్నావు?” అని భావం. కానీ నిర్ణయించడానికి మరియు తన న్యాయాన్ని వెల్లడి చేయడానికి దేవునికి అధికారముంది.
కుమ్మరిని గూర్చిన ఉదాహరణ యిర్మీయా 18:1-18 నుండి తీసుకోబడింది. కీలకమైన 18:7-10. 18:8 లేఖన భాగాలు, “ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును” అని చెబుతాయి.
► మీరు కుమ్మరి మరియు మట్టిని గూర్చిన ఉదాహరణను ఎలా ఉపయోగిస్తారు? దేవుడు, తన ఉగ్రతను కనబరిచే ఉద్దేశ్యంతో కొంతమంది ప్రజలను సృష్టించాడా? ఆయన మట్టి నుండి వివిధ రకాల వస్తువులను చేయడం అంటే భావం ఏమిటి?
[1]3:5-8లో ఇలాటి వాక్య భాగ్యముకు సంబంధించి నోట్స్ చూడండి.
అపొస్తలుని వ్యక్తిగత ముగింపు
కొంతమంది ప్రజలు, ఈ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని దేవుడు కొంతమందిని తీర్పు కొరకు, మరికొంతమందిని కనికరం చూపడానికి సృష్టించాడనే తీర్మానానికి వస్తారు. అయితే పౌలు ఈ అధ్యాయపు ముగింపులో తన ముఖ్యాంశాన్ని వెల్లడి చేస్తున్నాడు (9:30-33). రచయిత, తన స్వంత ఉదాహరణ నుండి తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పనివ్వడం ప్రాముఖ్యం. రచయిత చెప్పిన కథ అన్వయాన్ని తాను చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా మనం వాదించకూడదు. ఇది పౌలు ప్రధాన అంశం: ఒక వ్యక్తి విశ్వాసముంచుతాడా లేదా అనే దాని ఆధారంగానే దేవుడు తీర్పు తీరుస్తాడు. కుమ్మరిగా, అంగీకారానికి ప్రాతిపదికను / ఆధారాన్ని నిర్ణయించే హక్కు ఆయనకే ఉంటుంది.
దేవుడు తాను చేసే ప్రతిదానిలో ఎల్లప్పుడూ జ్ఞానవంతుడు, మంచివాడు, ప్రేమగలవాడు మరియు న్యాయవంతుడు గనుక దేవుని సార్వభౌమత్వంలో మనం ఆనందించాలి. ఆయనకు సంపూర్ణ అధికారం ఉన్నప్పటికిని, ఆయన అన్యాయంగా దేనిని చేయడు. ఆయన చర్యలు ఎల్లప్పుడూ తన స్వభావానికి అనుగుణంగానే ఉంటాయి.
దేవుడు తనకు కావలసిన వ్యక్తిని ఎటువంటి ప్రమాణం లేకుండా ఎన్నుకుంటాడనేది ఈ అధ్యాయం యొక్క ఉద్దేశ్యం కాదు. రక్షణ కొరకు దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించే ప్రమాణాన్ని ఏర్పరచడమే రోమా 9వ అధ్యాయంలోనున్న ప్రధాన అంశం. రక్షణార్థమైన విశ్వాసమే ఆ ప్రమాణం.
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 5వ భాగం, 1వ లేఖన భాగం
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 9:24-33 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ కొనసాగింపు
(9:24-26) చాలామంది అన్యులు జాతీయత ఆధారంగా దేవుని ప్రజలని పిలవబడకపోయినప్పటికిని, దేవుని ప్రజలలో భాగమయ్యారు. ఇది పత్రిక యొక్క గొప్ప మిషనరీ అంశంతో దీనిని ముడిపెడుతుంది: సువార్త, ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ అందించవచ్చు.
(9:27-29) చాలామంది యూదులు తిరస్కరించబడ్డారు, కేవలం కొద్దిమంది మాత్రమే రక్షణ పొందుతారు. యూదులు, కేవలం వాళ్ళు యూదులైనంత మాత్రాన రక్షణ పొందరు. దేవుడు, కనికరం లేకుండా న్యాయాన్ని ఆధారం చేసుకొని స్పందించినట్లయితే, వాళ్ళు సొదొమ వలె సంపూర్ణంగా నాశనమవుతారు.
(9:30-33) ఇది ఈ అధ్యాయం యొక్క ముగింపు. తన వ్యక్తిగత తుదితీర్మానం రాయడానికి రచయితను అనుమతించాలి. దేవుడు రక్షణ మార్గాన్ని ఏర్పరచాడనేది ఈ అధ్యాయపు అంశం. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని తమ వ్యక్తిగత నీతిని స్థాపించాలని ప్రయత్నించేవాళ్ళు విఫలమవుతారు. విశ్వాసం ద్వారా నీతిని వెదికే వారు విజయం సాధిస్తారు. తన స్వనీతిని స్థాపించాలని ప్రయత్నించే వ్యక్తి, దేవుడు వేసిన పునాది రాయిని బట్టి ఆటంకపరచబడతాడు, కానీ విశ్వాసముంచే వ్యక్తి సిగ్గుపడడు.
పాఠం 9 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) తన నీతిని మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడని మనమెలా తెలుసుకోగలం?
(2) దేవుడు న్యాయవంతుడని మనం చూడడం ఎందుకంత ప్రాముఖ్యం?
(3) దేవుని సార్వభౌమత్వాన్ని గురించి బైబిల్ దృక్కోణం ఏమిటి?
(4) రోమా 9వ అధ్యాయపు ప్రధాన అంశం ఏమిటి?
(5) ఇశ్రాయేలు కలిగి ఉన్న ఆత్మీయ ఆధిక్యతలు ఏమిటి?
(6) క్రైస్తవ్యానికి, యూదా మతానికి మధ్యనున్న అయిదు సంబంధాలు ఏమిటి?
(7) దేవుడు యాకోబును ఎన్నుకోవడాన్ని గురించి రోమా 9వ అధ్యాయం ఏం చెబుతుంది?
(8) మనం దేవుని సార్వభౌమాధికారంలో ఎందుకు ఆనందించాలి?
పాఠం 9 - అభ్యాసాలు
(1) దేవుడు ఎలా సార్వభౌమాధికారిగా ఉంటూనే, మనిషి ఎంపికకు ఎలాస్పందిస్తాడో ఒక పేజీలో వివరించండి. రోమా 9వ అధ్యాయాన్ని ఉపయోగించండి, అదే సమయంలో ఇతర లేఖనాలను కూడా వాడుకోండి.
(2) ఇతర సంఘాలకు చెందిన విశ్వాసులతో కనీసం రెండు సంభాషణలను సిద్ధం చేయాలి. వాళ్ళు దేవుని సార్వభౌమాధికారం గురించి ఏం ఆలోచిస్తున్నారో వివరించమని అడగాలి. రోమా పత్రికలో ఈ అంశానికి సంబంధించిన లేఖన భాగాలను మీరు వివరించాలి. ఆ సంభాషణ వివరణను రాసి, దానిని తరగతి నాయకునికి ఇవ్వాలి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.