అంత్యకాల సంభావాలను గూర్చిన లేఖనాలకు పరిచయం
లోకంలో దుష్టత్వం, అన్యాయం ఉన్నప్పటికీ, విశ్వాసాన్నికొనసాగించడం యొక్క సమస్యతో అంత్యకాల సంభావాలను గూర్చిన లేఖనాలు వ్యవహరిస్తున్నాయి. ఇది దేవుడు అకస్మాత్తుగా లోకంలో జోక్యం చేసుకొని, దుష్టత్వాన్ని శిక్షించి, తన ప్రజలకు సహాయం చేసే సమయాన్ని గురించి వివరిస్తుంది.[1]
దేవుడు చివరిగా జోక్యం చేసుకొనే సమయాన్ని సూచించడానికి తరచుగా “యెహోవా దినము” అనే మాటను ఉపయోగించారు. కొన్ని పాతనిబంధన లేఖనభాగాలు, ప్రభువు దినాన్ని, అన్యదేశాలు ఇశ్రాయేలుతో వ్యవహరించిన తీరును బట్టి శిక్షించే సమయాన్ని గురించి వివరించాయి.[2] యూదులుగా తాము దేవుని తీర్పును బట్టి భయపడాల్సిన అవసరం లేదని చాలామంది యూదులు భావించడం మొదలుపెట్టారు. వాళ్ళు పాపులుగా జీవిస్తే (జెఫన్యా 1:12, ఆమోసు 5:18-27), దేవుడు వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తాడని మరియు వాళ్ళు యూదులైనంత మాత్రాన విడిచిపెట్టడని చూపించడానికి ప్రవక్తలు ప్రయత్నం చేశారు; కానీ వారిలో ఆ భావన అలానే ఉండిపోయింది.
వాళ్ళు కూడా రక్షణపొందాల్సిన అవసరత ఉందనే వాస్తవాన్ని అంగీకరించడం యూదులకు కష్టంగా ఉండేది. ఉదాహరణకు, బాప్తిస్మం అనేది అన్యులను యూదామతంలోనికి తీసుకొచ్చే ఒక సంస్కారంగా వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు యూదులకు బాప్తిస్మమిచ్చేవాళ్ళు కాదు. బాప్తిస్మమిచ్చు యోహాను యూదులకు బాప్తిస్మమిచ్చాడు, అయితే తమకు బాప్తిస్మం లేదా పశ్చాత్తాపం అవసరం లేదని భావించే కొంతమంది యూదులు అతని పద్ధతిని వ్యతిరేకించారు. వాళ్ళు అబ్రహాము సంతానం గనుక (మత్తయి 3:9) వాళ్ళు దేవుని కృపను పొందుతారని భావించేవాళ్ళు.
రోమీయులకు రాసిన పత్రికలో, పౌలు ఉగ్రత దినాన్ని గురించి (2:5) మరియు దేవుడు తీర్పు తీర్చే దినాన్ని గురించి ప్రస్తావించాడు (2:16). ఈ రిఫరెన్స్లు, 1:16-18లో దేవుని ఉగ్రత నుండి తప్పించబడడమే రక్షణ అని చెప్పే సువార్తను అనుసరిస్తాయి. 2:2-3లో స్వనీతితో జీవించే యూదులు కూడా ప్రభువు దినాన్ని బట్టి భయపడడానికి ఒక కారణం ఉందనే వాస్తవాన్ని చెప్పడం ద్వారా వారిని దిగ్భ్రాంతికి గురి చేశాడు. యూదులకు కూడా రక్షణ కావాలి.