రోమాలోనున్న సంఘం
పట్టణం
పౌలు కాలంలో, రోము 10 లక్షలకు పైగా జనాభా కలిగి, ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణం.[1] ఇక్కడ అన్ని రకాల జాతులు, భాషలు, మతాలకు చెందిన ప్రజలు నివసించేవారు. చాలామంది బానిసలు ఉండేవారు.
రోముకు మొదటి మిషనరీలు
రోమా పట్టణానికి మొట్టమొదటిసారిగా సువార్తను ఎవరు తీసుకెళ్లారో మనకు తెలీదు. పెంతెకొస్తు పండుగ దినాన, రోమా నుండి వచ్చిన యూదులు కూడా ఉన్నారు (అపొస్తలుల కార్యములు 2:10). మారుమనసు పొందినవాళ్ళు ఖచ్చితంగా సువార్త సందేశాన్ని రోముకు తీసుకెళ్ళి ఉంటారు. మెస్సీయా వచ్చాడనే వారి ప్రకటన ఉత్సాహానికి, వివాదానికి కారణమయ్యేది. అప్పటికే యూదా మతాన్ని గౌరవించే అన్యుల మధ్యలో సువార్త శరవేగంతో వ్యాపించి ఉండేది.
అన్యుల సంఘం
పత్రికలో అక్కడక్కడా యూదులను గురించి ప్రస్తావించినప్పటికీ, రోమా సంఘంలో చాలామట్టుకు అన్యులే ఉన్నారు. పౌలు వారిని అన్యులు (1:13-15) అని పిలిచాడు మరియు తాను గ్రీకు దేశస్థులకును, గ్రీకు దేశస్థులు కాని వారికిని రుణస్తుడు గనుక రోమీయులకు కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే మొదటి విశ్వాసులు యూదులైనందున, రోమా సంఘంలో యూదుల ప్రభావం బలంగా ఉండేది. యూదా మత నియమాల నుండి స్వేచ్ఛను కలిగించే విధంగా విశ్వాసులకు సువార్తను స్పష్టంగా వివరించలేదనేది సాధ్యమే.