లేఖన అధ్యయనం - రోమా పత్రిక 5వ భాగం, లేఖ భాగాలు 2-3
రోమా 10వ అధ్యాయం, రోమా పత్రికకు పతాకసన్నివేశం. విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ కలుగుతుందని మరియు లోకంలో ఉన్నవారందరికి ఇది అవసరమని అపొస్తలుడు వివరించాడు. విశ్వాసం ఆవశ్యకం కనుక, సువార్త సందేశం ప్రాముఖ్యం: ప్రజలు సందేశాన్ని నమ్మునట్లు దానిని వినాల్సిన అవసరం ఉంది. పత్రిక ఉద్దేశ్యానికి ఈ అధ్యాయం ప్రాముఖ్యం, ఎందుకంటే పత్రిక అంతా సౌవార్తిక పనికి ఆధారాన్ని ఇస్తుంది.
రోమా 11వ అధ్యాయం, ఇశ్రాయేలుకు, సంఘానికి మధ్యనున్న సంబంధంతో వ్యవహరిస్తుంది. చాలామంది యూదులు సువార్తను తిరస్కరించారు. దేవుడు సర్వలోకం కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడని, యూదులు కూడా రక్షణ పొందే అవకాశం ఉందని పౌలు వివరించాడు. ఒక దినాన ఇశ్రాయేలు సంపూర్ణ దేశంగా క్రీస్తును అంగీకరిస్తుంది.